cm: పార్టీ మారడంపై పండగ తర్వాత స్పందిస్తా: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

  • నా అనుచరులపై ఇన్ని దాడులెప్పుడూ జరగలేదు
  • 4 నెలలుగా గన్నవరంలో అభివృద్ధి లేదు
  • ఈ విషయాలన్నీ జగన్ దృష్టికి తెచ్చా

ఏపీ సీఎం జగన్ తో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ రోజు భేటీ అయిన విషయం తెలిసిందే. దీంతో, వంశీ పార్టీ మారతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో వంశీని పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, 2006లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన అనుచరులపై ఇప్పుడు జరిగినన్ని దాడులు ఎప్పుడూ జరగలేదని, నాలుగు నెలలుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదని ఈ విషయాలన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. దీనిపై జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇక, పార్టీ మారే విషయమై ఆయన స్పందిస్తూ, దీపావళి పండగ తర్వాత చెబుతానని స్పష్టం చేశారు.

More Telugu News