PVP: ఈ టీడీపీ లెక్క చూడండి... ఎంత అద్భుతమో!: పీవీపీ

  • హుజూర్ నగర్ లో టీడీపీకి 1,895 ఓట్లు
  • అంకెలు కలిపితే 23
  • ఏపీలో టీడీపీ గెలిచిన అసెంబ్లీ సీట్లు కూడా అన్నేనన్న పీవీపీ

తెలంగాణలోని హుజూర్ నగర్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లను, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన సీట్లను పోలుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీవీపీ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 1,895 ఓట్లు రాగా, ఈ సంఖ్యలోని అంకెలన్నీ కలిపితే 23 వస్తుందని, సరిగ్గా అన్ని సీట్లనే ఏపీలో ఆ పార్టీ గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు.

ఇదో అద్భుతమని వ్యాఖ్యానించారు. 23 సంఖ్య తెలుగుదేశం పార్టీని నడిపిస్తోందని, "హుజూర్ నగర్ లో తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు 1895. 1 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి... ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది  23" అని ఆయన ట్వీట్ చేశారు.

More Telugu News