Telangana: తెలంగాణ గ్రూప్-2 తుది ఫలితాలు వెల్లడి

  • 1032 పోస్టులకుగాను 1027 పోస్టుల భర్తీ
  • 259 డిప్యూటీ తహసీల్దార్లుగా నియామకం
  • 284 మందికి ఎక్సైజ్ ఎస్సైలుగా ఉద్యోగాలు

తెలంగాణలో గ్రూప్-2 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈరోజు టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1032 పోస్టులకు గాను 1027 పోస్టులను భర్తీ చేశారు. వీరిలో 259 డిప్యూటీ తహసీల్దార్లుగా, 284 మందిని ఎక్సైజ్ ఎస్సైలుగా, 156 మందిని వాణిజ్య పన్నుల అధికారులుగా నియామకం కానున్నారు. మిగతావారిని మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులుగా ఉద్యోగాలు చేపట్టనున్నారు.

More Telugu News