Tsrtc: ఆర్టీసీ యూనియన్లు కార్మికుల గొంతు కోస్తున్నాయి: సీఎం కేసీఆర్ ఫైర్

  • ఆర్టీసీని వాళ్లే స్వయంగా ముంచుకుంటున్నారు
  • ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరు
  • ఈ పిచ్చి సమ్మెతో కోట్ల రూపాయల నష్టం

ఆర్టీసీ యూనియన్ల పేరిట నాయకులు చేస్తోంది ‘మహాపాపం’, ‘మహానేరం’ అని, అమాయక కార్మికుల గొంతులు కోస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీని వాళ్లే స్వయంగా ముంచుకుంటున్నారని, ఈ ప్రపంచంలో ఎవరూ కాపాడలేరని అన్నారు. ఆర్టీసీ పని తన దృష్టిలో అయిపోయినట్లే భావిస్తున్నానని చెప్పారు. ఆర్టీసీ తమ దగ్గర రూపాయి లేకుండా చేసుకుంటోందని, ఈ పిచ్చి సమ్మె కారణంగా రోజుకు పదకొండు కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతోందని విమర్శించారు.

More Telugu News