Vizag: కొత్తవలస-కిరండోల్ మార్గంలో విరిగిపడిన కొండచరియలు... రైళ్ల రాకపోకలకు అంతరాయం

  • విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు
  • నిలిచిపోయిన రైళ్లు
  • బొర్రాగుహల వద్ద నిలిచిపోయిన అరకు-విశాఖ ప్రత్యేక రైలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా కొత్తవలస-కిరండోల్ రైలు మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండోల్-విశాఖ ప్యాసింజర్ రైలు అరకు వద్ద నిలిచిపోగా, అరకు-విశాఖ ప్రత్యేక రైలు బొర్రా గుహల వద్ద నిలిచిపోయింది. కాగా, పట్టాలపై పడిన కొండచరియలను తొలగించి, దెబ్బతిన్న ట్రాక్ ను సరిదిద్దేందుకు రైల్వే అధికారులు శ్రమిస్తున్నారు.

More Telugu News