kerala: అత్యాచారం చేసి ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతున్నాడు: చర్చి బిషప్‌పై నన్ ఫిర్యాదు

  • ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ వేధిస్తున్నాడు
  • కొట్టాయం బిషప్‌పై నన్ ఆరోపణలు
  • జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు

ఓ చర్చి బిషప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ నన్ చేసిన ఆరోపణలు కేరళలో కలకలం రేపాయి.  కొట్టాయంకు చెందిన చర్చి బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ నన్ రాష్ట్ర, జాతీయ మహిళా సంఘానికి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ సందర్భంగా రహస్యంగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తన పరువును తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలి ఫిర్యాదును మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆమె ఆరోపణలపై విచారణకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

More Telugu News