Andhra Pradesh: ఏపీలో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాల నిలిపివేత కేసులో.. ఎంఎస్ వోలకు టీడీ శాట్ జరిమానా

  • ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై టీడీశాట్ ఆగ్రహం
  • రెండు రోజుల్లో ప్రసారాలు పునరుద్ధరించాలని ఆదేశం
  • వారంలోగా జరిమానాను చెల్లించాలన్న కోర్టు

ఆంధ్రప్రదేశ్ లో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై టీడీ శాట్ ఎంఎస్ వోలపై కొరడా ఝళిపించింది. ఒక్కో ఎంఎస్ వోకు ఐదువేల రూపాయల జరిమానా విధించింది. ఏడు రోజుల్లో జరిమానాను ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి చెల్లించాలని ఆదేశించింది. ప్రసారాలను పునరుద్ధరించాలని గతంలో టీడీ శాట్  ఇచ్చిన ఆదేశాలను ఎంఎస్ వోలు పాటించడంలో విఫలమైనందున ఏబీఎన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన టీడీ శాట్ ఈరోజు తీర్పును చెప్పింది. మొత్తం ఏడుగురు ఎంఎస్ వోలు తలా రూ.5 వేలు జరిమానా చెల్లించాలని పేర్కొంది.  

More Telugu News