Andhra Pradesh: ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా?: నక్కా ఆనందబాబు

  • టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవ యాత్ర
  • ఈ యాత్రను అడ్డుకున్న పోలీసులు
  • వర్లపై పోలీస్ సంఘం అధికారుల వ్యాఖ్యలు సరికాదు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విజయవాడలో దళితుల ఆత్మగౌరవ యాత్ర ఈరోజు నిర్వహించారు. ఈ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్ల రామయ్యపై పోలీస్ అధికారుల సంఘం నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వర్ల రామయ్యపై రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు గుప్పించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More Telugu News