Dhanush: ధనుశ్ మూవీ రీమేక్ పై ఆసక్తిని చూపుతున్న చరణ్

  • దసరాకి తమిళంలో విడుదలైన 'అసురన్'
  • ధనుశ్ నటనకి దక్కుతున్న ప్రశంసలు 
  • చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రం 

కొరటాల మూవీ తరువాత చిరంజీవి కథానాయకుడిగా ఓ మలయాళ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో చరణ్ వున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన 'లూసిఫర్' ను తెలుగులోకి రీమేక్ చేయాలనే ఉద్దేశంతో చరణ్ ఆ హక్కులను దక్కించుకున్నాడు. ఇక తన కోసం ఆయన ఒక తమిళ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వెట్రిమారన్ దర్శక ప్రతిభకు .. ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Telugu News