Train: తప్పతాగి పట్టాలపై పడుకున్నాడు.. మీద నుంచి మూడు రైళ్లు వెళ్లినా ఏమీ కాలేదు!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • పోలీసులకు సమాచారం ఇచ్చిన రైలు డ్రైవర్
  • మత్తు వదిలిన తరువాత నిద్రలేచిన ధర్మేంద్ర

అసలే తప్పతాగున్నాడు. ఒళ్లు తెలియకుండా నడుస్తూ వెళ్లి, రైలు పట్టాలపై స్పృహ లేకుండా పడిపోయాడు. అతని పై నుంచి మూడు రైళ్లు వెళ్లాయి. ఆపై మత్తు వదలగా, నిద్ర నుంచి లేచినట్టుగా లేచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అతని పేరు ధర్మేంద్ర. పట్టాలపై పడివున్న ఓ వ్యక్తిని గమనించిన రైలు డ్రైవర్, వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సరికి, ఆ దారిలో మూడు రైళ్లు వెళ్లాయి. పోలీసులు వచ్చిన తరువాత ధర్మేంద్ర లేచాడు. అతని శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడాన్ని చూసిన పోలీసులు.. తాగుబోతే అయినా, మృత్యుంజయుడని అంటూ, మందలించి పంపారు.

More Telugu News