Paruchuri: మా సినిమా ద్వారానే రజిత పరిచయమైంది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'అగ్నిపుత్రుడు' సమయంలో రజితను చూశాను
  • చిన్నపిల్లగా తన కెరియర్ ను మొదలెట్టింది 
  • అంచలంచెలుగా ఎదిగిందన్న గోపాలకృష్ణ  

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ 'రజిత' గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "అవి మేము అక్కినేని నాగేశ్వరరావుగారి 'అగ్నిపుత్రుడు' సినిమా కోసం పనిచేస్తున్న రోజులు. ఆ సినిమాలో ఏఎన్నార్ గారి కూతురు పాత్ర కోసం ఎవరైతే బాగుంటారా అని చూస్తున్నాం. ఆ సమయంలోనే రజిత నా కంటపడింది. అప్పటికి చాలా చిన్న పిల్ల. దాంతో ఆ అమ్మాయిని ఆ సినిమాతో పరిచయం చేశాము.

అలా ఇండస్ట్రీకి పరిచయమైన రజిత, నాకు తెలిసి 500 సినిమాలకి పైగా చేసి ఉంటుంది. ఒక గిరిజ .. గీతాంజలి .. రమాప్రభ బాటలో ఆ తరహా వేషాలు వేస్తూ వెళుతుందని నేను భావించాను. కానీ ఆ అమ్మాయి తను ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించింది. కామెడీ పాత్రలను ఎక్కువగా చేసిన రజిత, 'అడవిలో అన్న' సినిమాలో కంటతడి పెట్టించే పాత్రలోనూ మెప్పించింది. ఆ తరువాత తనకి నంది అవార్డు వచ్చినట్టుగా ఆ అమ్మాయి ఫోన్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News