Vikram: తనయుడితో కలసి విక్రం భారీ మల్టీస్టారర్

  • 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ గా 'ఆదిత్య వర్మ'
  • వచ్చేనెల 8వ తేదీన విడుదల 
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు 

ప్రస్తుతం విక్రమ్ రెండు భారీ సినిమాలతో బిజీగా వున్నాడు. ఆయన తనయుడు ధృవ్ హీరోగా చేసిన 'ఆదిత్యవర్మ' వచ్చేనెల 8వ తేదీన విడుదల కానుంది. 'అర్జున్ రెడ్డి'కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా, నిన్న చెన్నైలో ఆడియో వేడుక జరుపుకుంది. ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేశ్ మెహతా నిర్మించిన ఈ సినిమాలో బనిత సంధు కథానాయికగా కనిపించనుంది.

నిన్న జరిగిన 'ఆదిత్యవర్మ' ఆడియో వేడుకలో నిర్మాత ముఖేశ్ మెహతా ఒక ప్రకటన చేశారు. తమ బ్యానర్లో విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ హీరోలుగా ఒక భారీ మల్టీస్టారర్ మూవీ ఉంటుందనీ, 2021- 22 మధ్య ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెప్పారు. దాంతో విక్రమ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ధృవ్ ఫస్టు మూవీగా వస్తోన్న 'ఆదిత్య వర్మ' భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు.

More Telugu News