Tirumala: విరాళమిచ్చిన భక్తునికి వీఐపీ బ్రేక్ దర్శనం... నాలుగు టికెట్లు కొన్న చెన్నై భక్తుడు!

  • విరాళమిచ్చే వారికి ప్రొటోకాల్ దర్శనం
  • రూ. 40 వేలు చెల్లించి నాలుగు టికెట్లు కొన్న భక్తుడు
  • స్వయంగా టికెట్లు ఇచ్చిన ఏఈఓ ధర్మారెడ్డి

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానంలో వీఐపీలకు మాత్రమే లభించే ప్రొటోకాల్ దర్శనాన్ని విరాళమిచ్చే వారికీ కల్పిస్తూ, శ్రీవాణి ట్రస్ట్ ను ప్రారంభించి, రూ.10 వేలకు ఓ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ఇస్తామని ప్రకటించిన తరువాత, తొలి టికెట్లు అమ్ముడయ్యాయి. చెన్నైకి చెందిన రామయ్య అనే భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 40 వేలు విరాళంగా ఇచ్చి, ఆపై ఒక్కో టికెట్ కు రూ. 500 చెల్లించి నాలుగు టికెట్లను పొందారు. టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, రామయ్య కుటుంబానికి ఈ టికెట్లను అందించారు.

శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు అంతకుమించి ఇచ్చే దాతలకు ప్రత్యేక ప్రివిలేజ్‌ కింద బ్రేక్‌ దర్శన టికెట్‌ ఇవ్వాలని గతంలోనే నిర్ణయించిన టీటీడీ, సోమవారం నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది. భక్తుల కోసం గోకులం విశ్రాంతి భవనంలో సింగిల్‌ విండో కౌంటర్‌ ను కూడా ఏర్పాటు చేశారు.

More Telugu News