TSRTC: సాయంత్రం మరోసారి తమిళిసైని కలవనున్న ఆర్టీసీ జేఏసీ నేతలు

  • సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తో భేటీ
  • రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్న నేతలు
  • కోర్టు తీర్పును కూడా పట్టించుకోవడం లేదని మండిపాటు

ఆర్టీసీ కార్మికుల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పలు ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నప్పటికీ... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైను మరోసారి కలిసేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆమెతో భేటీ కానున్నారు. సమ్మెతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పోరాటాన్ని ఆపబోమని చెప్పారు.

More Telugu News