Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. అందరూ చూస్తుండగానే కత్తులతో వెంటాడి హత్య

  • మృతుడి పేరు రియాసత్ అలీగా గుర్తించిన పోలీసులు 
  • మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన సమయంలో హత్య
  • మూడు నెలల క్రితం ఆటోడ్రైవర్‌ హత్యలో రియాసత్‌ ఏ1 ముద్దాయి

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఈ రోజు ఉదయం కలకలం చెలరేగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో వెంటాడి హత్య చేశారు. మృతుడి పేరు రియాసత్ అలీగా పోలీసులు గుర్తించారు. ఉదయాన్నే మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన అతడిపై కొందరు దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారని వివరించారు.

కాగా, మూడు నెలల క్రితం అన్వర్‌ అనే ఆటోడ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రియాసత్‌ అలీ ఏ1 ముద్దాయిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే దుండగులు కత్తులతో ఆయనపై పగ తీర్చుకున్నట్లు తెలుస్తోంది. రియాసత్ మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షలే అతడి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News