Telangana: కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, పద్మావతి, రేవంత్ రెడ్డిపై సీఈసీకి ఫిర్యాదు

  • ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు
  • సీఎం కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • ఈ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఈసీకి అడ్వకేట్ జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ మేరకు సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ముగ్గురిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అడ్వకేట్ జేఏసీ అధికార ప్రతినిధి ఉపేంద్ర కోరారు. మంత్రులపై, తమ కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేశారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు.

More Telugu News