Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగుల కోసం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

  • సీఎం జగన్ కీలక నిర్ణయం
  • నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్న కార్పొరేషన్
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ సర్కారు నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 అనుసరించి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కన్సల్టెన్సీ, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ తదితర రంగాల్లో ఈ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాల కల్పన చేపట్టనున్నారు.

 కాగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించాలని గత వారమే నిర్ణయించారు. ఇక, నూతనంగా ఏర్పాటైన ఈ కార్పొరేషన్ కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు ఉంటాయి. జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ తన హోదా ప్రకారం ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉంటారు.

More Telugu News