Guntur: రూ.కోటి జరిమానాను చెల్లించిన గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్!

  • రిజిస్టేషన్ ఫీజు చెల్లించని సంస్థ
  • తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాల విక్రయం
  • ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నుల ఎగవేత

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలను విక్రయిస్తున్న గుంటూరులోని గౌతమ్ హీరో షోరూమ్ కు ఏపీ రవాణా శాఖ జరిమానా విధించింది. ఈ విధంగా సదరు షోరూమ్ 576 వాహనాలు విక్రయించినట్టు రవాణాశాఖ తన విచారణలో గుర్తించింది. ప్రభుత్వానికి రూ.41 లక్షల పన్నులు ఎగవేసినట్టు అధికారుల లెక్కలో తేలింది.

 ఈ నేపథ్యంలో గౌతమ్ షోరూం యజమానికి కోటి రూపాయల జరిమానాను రవాణా శాఖ కమిషనర్ విధించారు. ఇంత మొత్తంలో జరిమానా విధించడం రవాణా శాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని మరో 7 షోరూమ్ లకు రూ.39 లక్షల మేరకు జరిమానాలు విధించినట్టు సమాచారం. కాగా, కోటి రూపాయల జరిమానాను గౌతమ్ హీరో  షోరూమ్ చెల్లించింది.

More Telugu News