Jagan: ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ సమీక్ష... ముఖ్యాంశాలు ఇవిగో!

  • కంటి వెలుగు పథకం కాలేజీలకూ వర్తింపు
  • పొరుగు రాష్ట్రాల ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ
  • డిసెంబరు 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.

ముఖ్యాంశాలు

  • నవంబరు 1 నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు
  • పొరుగు రాష్ట్రాల్లో 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ
  • శస్త్రచికిత్స చేయించుకున్నవారు కోలుకునేంతవరకు నెలకు రూ.5,000 లేదా రోజుకు రూ.225 (డిసెంబరు 1 నుంచి అమలు)
  • కిడ్నీ వ్యాది బాధితులకు నెలకు రూ.5,000
  • తలసేమియా, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10,000
  • పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్లుచేతులు లేనివారికి నెలకు రూ. 5 వేలు పెన్షన్ (జనవరి 1 నుంచి అమలు)
  • డెంగ్యూ జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీలో స్థానం
  • డబుల్ కాక్లియర్ ఇంప్లాంట్ కు ఆరోగ్యశ్రీలో స్థానం
  • కంటి వెలుగు పథకం కాలేజీలకూ వర్తింపు
  • డిసెంబరు 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
  • ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రూ.16 వేలకు పెంపు
  • జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2000 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  • ఇతర జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు అమలు
  • బైకుల ద్వారా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు
  • ప్రజలందరికీ కంటి పరీక్షలు
  • ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి ఆసుపత్రి
  • రోడ్డు ప్రమాద బాధితుల కోసం అత్యవసర నిధి ఏర్పాటు

More Telugu News