budda venkanna: శకుని మామకు మైండ్ పోయింది: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు

  • నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని డబ్బా కొట్టుకున్నారు
  • మీ కార్యకర్తలతో కూడిన వాలంటీర్లతో నువ్వు సాధించింది ఏంటో చెప్పగలవా?
  • ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గ్రామాల్లో అడుగుపెట్టి చూడు

ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. విజయ సాయిరెడ్డిని 'శకుని మామా' అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో మరోసారి ఎద్దేవా చేశారు.

'నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని డబ్బా కొట్టుకుంటూ మీ కార్యకర్తలతో కూడిన వాలంటీర్లతో నువ్వు సాధించింది ఏంటో చెప్పగలవా? అంతెందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గ్రామాల్లో అడుగుపెట్టి చూడు..  నీకు పట్టిన మబ్బులు వీడిపోవడం ఖాయం శకుని మామా!!' అని ఆయన విమర్శించారు.
 
'తాను బెస్ట్ సీఎం అవుతానని అనుకున్న వ్యక్తి కాస్తా తుగ్లక్ ముఖ్యమంత్రిగా మిగిలిపోయే సరికి శకుని మామ మైండ్ పోయింది. తుగ్లక్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని గుర్తించి రాష్ట్రం వదిలి ఢిల్లీకి పారిపోయావా శకుని మామా?' అని బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

More Telugu News