Chidambaram: ఈడీ కస్టడీకి చిదంబరం.... జైల్లో ప్రత్యేక సదుపాయాలు

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ
  • ఈ నెల 24 వరకు కస్టడీ
  • విచారణ కాలంలో చిదంబరంకు ప్రత్యేక సదుపాయాలు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఇప్పటికే సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా చిదంబరంను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 24 వరకు కస్టడీ విధిస్తున్నట్టు తెలిపింది. అయితే, చిదంబరంను ఈడీ విచారించే సమయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రత్యేకమైన గది, ఇంటి నుంచి భోజనం, వెస్ట్రన్ టాయిలెట్, ఔషధాలు సమకూర్చనున్నారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News