Andhra Pradesh: ఏపీ ఇమేజ్ ప్రతిబింబించేలా లోగో డిజైన్ చేయండి... బహుమతులు గెలుచుకోండి: ఏపీ సర్కారు

  • లోగో డిజైనింగ్ కోసం పోటీ
  • ఆంధ్రప్రదేశ్ బ్రాండథాన్ ప్రకటించిన సర్కారు
  • మూడు అత్యున్నత ఎంట్రీలకు బహుమతులు

ఏపీ ప్రభుత్వం రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ను నలుదిశలా చాటేలా సరికొత్త లోగో డిజైనింగ్ కోసం కాంపిటీషన్ నిర్వహిస్తోంది. 'ఆంధ్రప్రదేశ్ బ్రాండథాన్' పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీ ఆఖరు తేదీ అక్టోబరు 28. ఈ కాంటెస్ట్ లో పాల్గొనే వారు ముందుగా https://bit.ly/2m1KVml లింక్ ద్వారా తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంట్రీలకు బహుమతులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మంచి లోగోను డిజైన్ చేయడంతో పాటు మంచి ట్యాగ్ లైన్ ను కూడా సూచించాలని ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

More Telugu News