Vijaysai Reddy: సవాల్ కు సిద్ధమా శకుని మామా?: బుద్ధా వెంకన్న

  • ప్రశ్నాపత్రం లీకేజీపై విచారణకు ఎందుకు భయపడుతున్నారు?
  • లీకు వీరుడిని పట్టుకుని గ్రీకు వీరుడు అన్నట్టు విల్డప్ ఇస్తున్నావు
  • నేను, జగన్ పరీక్ష రాస్తాం.. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్రామ సచివాలయం పరీక్షలను నిజాయతీగా జరిపించాం అనే నమ్మకం ఉంటే... లీకేజీపై విచారణ చేయించడానికి మీ తుగ్లక్ ఎందుకు భయపడుతున్నట్టు శకుని మామా? అని ప్రశ్నించారు.

లీకు వీరుడిని పట్టుకుని గ్రీకు వీరుడు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు అంటూ ఎద్దేవా చేశారు. 'నీకు నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు లీక్ చేసిన పేపర్ నాకు కూడా పంపండి. నేను, మీ తుగ్లక్ ముఖ్యమంత్రి పరీక్ష రాస్తాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందాం. సవాల్ కు సిద్ధమా శకుని మామా?' అంటూ విజయసాయిని ఛాలెంజ్ చేశారు.

More Telugu News