Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం!

  • శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మకు భారీగా కానుకలు
  • దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.6.77 కోట్లు
  • బంగారు నగల కానుకలు 1.23 కిలోలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావడం విదితమే. అమ్మ వారికి కానుకలు కూడా భక్తులు భారీగానే సమర్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. హుండీ ద్వారా రూ.6.77 కోట్లు, కానుకల రూపంలో 1.23 కిలోల బంగారం, 27.81 కిలోల వెండి, అన్నదాన హుండీ ద్వారా రూ.10.32 లక్షలు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు.  

More Telugu News