Chandrababu: టీడీపీ పథకాలన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది: చంద్రబాబునాయుడు విమర్శ

  • ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం
  • అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది మా పార్టీ లక్ష్యం
  • పేదల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించాలి

వైసీపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించి, అన్న క్యాంటీన్ వంటి పథకాలను పునరుద్ధరించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నది తమ పార్టీ ప్రధాన లక్ష్యం అని అన్నారు. నాటి కిలో రూ.2 బియ్యం పథకం నుండి నిన్నటి ‘అన్న క్యాంటీన్’ వరకు టీడీపీ పథకాలన్నీ ఈ లక్ష్యంతోనే రూపుదిద్దుకున్నాయని అన్నారు. కేవలం, టీడీపీ పథకాలు అన్న కారణంగా వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, పేదలను విస్మరించిందని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం పేదల గురించి ఆలోచించాలని, పేదలకు ఆహారభద్రత కల్పించాలని సూచించారు.


More Telugu News