Sensex: మార్కెట్లకు ఈరోజు కూడా లాభాలే!

  • 93 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, బ్యాంకింగ్ స్టాకులు ఒత్తిడికి లోనైనప్పటికీ... ఐటీ, ఫార్మా, ఎనర్జీ, ఇన్ఫ్రా స్టాకుల్లో మాత్రం కొనుగోళ్ల జోరు కొనసాగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 93 పాయింట్లు లాభపడి 38,599కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని 11,464కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.57%), ఓఎన్జీసీ (2.05%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.56%), యస్ బ్యాంక్ (0.55%).

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (-2.73%), వేదాంత లిమిటెడ్ (-2.54%), ఏసియన్ పెయింట్స్ (-2.04%), ఎన్టీపీసీ (-1.59%), ఐటీసీ (-1.54%).

More Telugu News