Jammu And Kashmir: ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు.. కశ్మీర్‌లో కొనసాగుతున్న భీకర ఎన్‌కౌంటర్

  • ఉదయం నుంచి కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
  • ఇంట్లో నక్కింది ముగ్గురు ఉగ్రవాదులుగా అనుమానం
  • ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా, బిజ్‌మెహరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఈ ఉదయం భద్రతా దళాలు తనిఖీలు ప్రారంభించగా, ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి.

దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి. లోపల ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించిన అధికారులు.. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, వారం రోజులుగా గాలిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులు మంగళవారం గాందర్బల్ అడవుల్లో పోలీసులకు పట్టుబడ్డారు.

More Telugu News