Paruchuri: ఆ సినిమా షూటింగు సమయంలోనే విజయశాంతి తల్లి మరణించింది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'అపూర్వ సహోదరులు'లో ఒక హీరోయిన్ విజయశాంతి 
  • మైసూర్ ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంది
  • అప్పుడే విజయశాంతి ఇంటినుంచి కబురొచ్చింది

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో విజయశాంతి గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. 'అపూర్వ సహోదరులు' సినిమా షూటింగ్ మైసూర్ ప్యాలెస్ లో జరుగుతుండగా, వేరే సినిమా సిట్టింగ్ కోసం అక్కడ నేను రాఘవేంద్రరావుగారిని కలిశాను. ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా విజయశాంతి నటిస్తోంది. ఆ సమయంలోనే ఆమె తల్లిగారు చనిపోయినట్టుగా కబురు వచ్చింది.

అసలు విషయం విజయశాంతికి చెప్పకుండా చెన్నైలోని ఆమె ఇంటికి తీసుకెళ్లమని రాఘవేంద్రరావుగారు చెప్పారు. ఆ సమయంలో మా ఆవిడ కూడా నాతోనే వుంది. మేమిద్దరం కలిసి విజయశాంతిని వెంటబెట్టుకుని బయలుదేరాము. 'ఏం కాదమ్మా మీ అమ్మగారికి ఒంట్లో కాస్త నలతగా ఉందట .. అంతే. కంగారు పడవలసిన అవసరం లేదు' అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పుకుంటూ ఇంటివరకూ తీసుకెళ్లాము. మొన్న 11వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో నేను కలిసినప్పుడు విజయశాంతి ఈ విషయాన్ని గుర్తుచేసుకుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News