BCCI: భారత క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి: గంగూలీ కొత్త ఇన్నింగ్స్ పై లక్ష్మణ్ వ్యాఖ్యలు

  • బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ
  • ఈ నెల 23న బాధ్యతల స్వీకరణ
  • శుభాకాంక్షలు చెబుతున్న క్రికెట్ లోకం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోబోతున్న కోల్ కతా ప్రిన్స్ సౌరవ్ గంగూలీపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండగా, గంగూలీ ఒక్కడే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఖాయమైంది. ఈ నెల 23న బాధ్యతలు అందుకోవడం లాంఛనం కానుంది. ఈ నేపథ్యంలో, ఒకప్పటి సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా రాకతో భారత క్రికెట్ మరింత ముందుకు వెళుతుందనడంలో  తనకు ఎలాంటి సందేహం లేదని ట్వీట్ చేశాడు. కొత్త పాత్రలోనూ గంగూలీ మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్టు లక్ష్మణ్ తెలిపాడు.

మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ రానుండడం భారత క్రికెట్ కు శుభసూచకం అని వ్యాఖ్యానించాడు. "ఇప్పటికే నువ్వు భారత క్రికెట్ కు అద్భుతమైన సేవలు అందించావు. దానికి కొనసాగింపే ఈ కొత్త ఇన్నింగ్స్" అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

More Telugu News