Anantapur District: రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో నాలుగు మృతదేహాలు... హిందూపురం మండలంలో కలకలం

  • పట్టాలపై మూడు చోట్ల పడివున్న మృతదేహాలు
  • హత్యలా? ఆత్మహత్యలా? అన్న సందేహాలు 
  • దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు

అనంతపురం జిల్లాలో అనుమానాస్పద స్థితిలో నాలుగు మృతదేహాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్ పై ఈ మృతదేహాలు విసిరేసినట్టుగా పడివున్నాయి. ఈ నాలుగు మృతదేహాలు రైలు పట్టాలపై మూడు చోట్ల పడివుండగా స్థానికులు గుర్తించారు. హిందూపురం రైల్వే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇవి ఆత్మహత్యలా? లేక ఎక్కడైనా హత్య చేసి మృతదేహాలను పట్టాలపై పడేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News