Jagan: రైతు భరోసాను ప్రారంభించిన జగన్.. రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించాడన్న సీఎం

  • దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ సాయాన్ని రైతులకు అందిస్తున్నాం
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చా
  • రైతులకు సాయం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా

'వైయస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్' కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోయారని... రాష్ట్రమంతా ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయని... రైతులను దేవుడు నిండు మనసుతో ఆశీర్వదించారని అన్నారు. పదేళ్ల తర్వాత రిజర్వాయర్లన్నీ నీటికుండలుగా మారాయని తెలిపారు. దేశంలోనే ఒక గొప్ప పథకాన్ని ఈరోజు ప్రారంభించామని... ఏ రాష్ట్రం కూడా ఇవ్వనంత ఎక్కువ పెట్టుబడి సాయాన్ని ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తామని చెప్పారు. తన పాదయాత్రలో రైతుల ఆవేదనను చూశానని... రైతులకు సాయం చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చానని చెప్పారు. 

More Telugu News