tsrtc: ఆర్టీసీ సమ్మె కారణంగా ‘మెట్రో’ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది: ఎన్వీఎస్ రెడ్డి

  • పదిరోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది
  • ‘మెట్రో’లో ఈరోజు రాత్రి 7 గంటల వరకూ 3 లక్షల 5 వేల మంది ప్రయాణించారు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పది రోజులుగా కొనసాగుతోంది. దీంతో, తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా, మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సమ్మె కారణంగా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని అన్నారు. ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకూ మెట్రో రైలులో 3 లక్షల 5 వేల మంది ప్రయాణించినట్టు చెప్పారు.

More Telugu News