TRS: సీపీఐ కీలక నిర్ణయం.. టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరణ

  • ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి సీపీఐ నిరసన
  • ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తాం
  • తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటన

అధికార పార్టీ టీఆర్ఎస్ కు సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు ప్రకటించిన మద్దతును సీపీఐ ఉపసంహరించుకుంది. ఈ మేరకు తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హుజూర్ నగర్ లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనేది రేపు ప్రకటిస్తామని, ఆర్టీసీ ఉద్యమంలో అగ్రభాగాన ఉండాలని నిర్ణయించామని అన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా కార్మికులను చర్చలకు పిలవాలని, వారి సమస్యలు పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News