Sukumar: చిరూ 153వ సినిమాకి దర్శకుడిగా సుకుమార్?

  • 'సైరా'తో విజయాన్ని అందుకున్న చిరూ 
  • కొరటాలతో కలిసి త్వరలో సెట్స్ పైకి  
  • 'లూసిఫర్' రీమేక్ కి జరుగుతోన్న సన్నాహాలు

చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సైరా' భారీ విజయాన్ని నమోదు చేసింది. చిరంజీవి అభిమానుల అంచనాలను అందుకుంది. దాంతో చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుగా 152వ సినిమాపై దృష్టిపెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సామాజిక సందేశంతో కూడిన వినోదభరితమైన కథ ఇది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆ సినిమా పూర్తయ్యేలోగా మరో ప్రాజెక్టును సిద్ధంగా ఉంచాలనే ఉద్దేశంతో చిరంజీవి - చరణ్ వున్నారు. మలయాళంలో ఈ మధ్య మోహన్ లాల్ చేసిన సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇందుకోసం తెలుగు రీమేక్ రైట్స్ ను చరణ్ సొంతం చేసుకోవడం జరిగిపోయింది. ఈ రీమేక్ కి దర్శకుడిగా సుకుమార్ పేరు వినిపిస్తోంది. 'రంగస్థలం' బ్లాక్ బస్టర్ అయిన దగ్గర నుంచి మెగా ఫ్యామిలీతో సుకుమార్ కి సాన్నిహిత్యం ఏర్పడిన సంగతి తెలిసిందే.

More Telugu News