Raj Tarun: 'ఇద్దరి లోకం ఒకటే' నుంచి ఫస్టు సింగిల్

  • దిల్ రాజు నుంచి మరో ప్రేమకథ 
  •  రాజ్ తరుణ్ జోడీగా షాలినీ పాండే 
  • సంగీత దర్శకుడిగా మిక్కీ.జె మేయర్

రాజ్ తరుణ్ - షాలినీ పాండే జంటగా జీఆర్ కృష్ణ దర్శకత్వంలో 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా రూపొందుతోంది. దిల్ రాజు బ్యానర్లో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నువ్వే నువ్వే నువ్వేకదా .. నా తోడు నువ్వే కదా, నీకూ నాకూ వుందో కథా .. ఆ పేరు ప్రేమే కదా .. యూ ఆర్ మై హార్ట్ బీట్" అంటూ ఈ పాట సాగుతోంది. మిక్కీ జె.మేయర్ సంగీతం .. బాలాజీ సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఫీల్ తో కూడిన ఈ మెలోడీ యూత్ హృదయాలకి కనెక్ట్ అయ్యేలానే వుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రాజ్ తరుణ్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

More Telugu News