Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 87 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతం పైగా పెరిగిన ఓఎన్జీసీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో మార్కెట్లు మంచి లాభాల్లోనే కొనసాగినప్పటికీ... చివర్లో లాభాలు కొంత హరించుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్లు లాభపడి 38,214కి పెరిగింది. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,330కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (5.34%), టాటా మోటార్స్ (4.90%), భారతి ఎయిర్ టెల్ (2.61%), సన్ ఫార్మా (2.43%), యస్ బ్యాంక్ (2.15%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-3.49%), బజాజ్ ఫైనాన్స్ (-2.76%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.09%), ఎల్ అండ్ టీ (-0.59%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-0.28%).

More Telugu News