Car: మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు జాతీయ హాకీ ఆటగాళ్ల దుర్మరణం!

  • హోషంగా బాద్ సమీపంలో అదుపుతప్పిన కారు
  • ధ్యాన్ చంద్ హాకీ పోటీలకు వెళుతున్న ఆటగాళ్లు
  • ముగ్గురికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్ లోని హోంషంగాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధ్యాన్ చంద్ హాకీ పోటీల్లో పాల్గొనేందుకు ఇటార్సీకి వెళుతున్న నలుగురు జాతీయ హాకీ క్రీడాకారులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు క్రీడాకారులకు తీవ్ర గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 69వ జాతీయ రహదారిపై రైసల్ పూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగంగా వస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News