Woman: మహిళా రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసిన డాక్టర్!

  • పైల్స్ సమస్యతో ఆసుపత్రికి వచ్చిన మహిళ
  • మత్తులో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి.. వీడియో తీసిన వైనం
  • ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ ఒత్తిడి

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళా రోగిపై ఓ డాక్టర్ పాశవికంగా అత్యాచారం జరపడం కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని జోగేశ్వరి ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (27) పైల్స్ సమస్యతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం అదే ప్రాంతంలో ఉన్న డాక్టర్ వంశరాజ్ ద్వివేది క్లినిక్ కు వచ్చింది. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 45 నిమిషాల పాటు నిద్రపోవాలని ద్వివేది సూచించాడు. ఆ తర్వాత ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి, దాన్ని వీడియో తీశాడు.

ఆ తర్వాత ఆ వీడియోను బాధితురాలికి పంపి, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ద్వివేది ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఓ యువకుడిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమెను బెదిరించాడు. ద్వివేది బెదిరింపులను తట్టుకోలేకపోయిన ఆమె... జరిగిన విషయాన్ని తన భర్తతో చెప్పింది. అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ద్వివేదిని అరెస్ట్ చేశారు.

More Telugu News