Gandhi: గాంధీ ఆత్మహత్య చేసుకున్నారా..? గుజరాత్ లో 9వ తరగతి పరీక్షలో వింత ప్రశ్న

  • ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో విచిత్రం
  • గాంధీ పుట్టిన గుజరాత్ లోనే అవమానం
  • విచారణకు ఆదేశించిన అధికారులు

గుజరాత్ లోని ఓ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులను ఎవరూ అడగని విచిత్రమైన ప్రశ్న అడిగారు. గాంధీనగర్ లోని సుఫలాంశల వికాస్ సంకుల్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా "గాంధీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు?" అంటూ ఓ ప్రశ్న ఇచ్చారు. ఈ ప్రశ్న చూసి విద్యాశాఖ అధికారులే నివ్వెరపోయారు. గాంధీని చంపింది గాడ్సే అని లోకమంతా తెలుసు. కానీ ఆ ప్రశ్న ఇచ్చిన విద్యావేత్తలకు తెలియకపోవడమే అత్యంత విచారకరం! పైగా, గాంధీ పుట్టిన గుజరాత్ లోనే ఇలాంటి ప్రశ్న పుట్టుకొచ్చిందంటే అది ఆ మహనీయుడికి కచ్చితంగా అవమానమే!

ఇదే అనుకుంటే, ఇలాంటిదే ప్లస్ టూ విద్యార్థులకు మరో ప్రశ్న ఎదురైంది. "మీ ప్రాంతంలో మద్యం అమ్మకాలు మరింత పెరగాలంటే ఏంచేయాలో పోలీసు ఉన్నతాధికారికి లేఖ రాయండి" అంటూ ప్రశ్న అడిగారు. ఈ తప్పిదాలను గాంధీనగర్ జిల్లా విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులపై చర్యలకు విచారణకు ఆదేశించారు.

More Telugu News