Jio: వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన జియో

  • ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామన్న జియో
  • తీవ్ర అసంతృప్తికి గురైన జియో వినియోగదారులు
  • 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ను ఆఫర్ చేసిన జియో

జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే ఫోన్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయబోతున్నామంటూ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో జియో వినియోగదారులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, తమ కస్టమర్లకు జియో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు సంబంధించి 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ను అందించనున్నట్టు తెలిపింది. తొలిసారి రీచార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు ఈ ఆఫర్ ను ఇస్తున్నట్టు తెలిపింది. అయితే, రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.

More Telugu News