Narendra Modi: మోదీ విలక్షణత... మహాబలిపురం బీచ్ లో చెత్తను ఏరివేసిన ప్రధాని!

  • ప్రస్తుతం తమిళనాడులో నరేంద్ర మోదీ
  • ఈ ఉదయం బీచ్ లో వాకింగ్
  • కనిపించిన చెత్తనంతా తీసేసిన భారత ప్రధాని

స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన నరేంద్ర మోదీ, మరోసారి తన విలక్షణతను చాటుకున్నారు. ఈ ఉదయం మహాబలిపురంలో వాకింగ్, యోగా నిమిత్తం బీచ్ కు వచ్చిన ఆయన, అక్కడి చెత్తను చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆపై వెంటనే ఓ సంచీ తీసుకుని వచ్చి, అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్పులను ఏరడం ప్రారంభించారు. తాను సేకరించిన చెత్తను కవర్లలో వేస్తూ, వాటిని వరుసగా పేరుస్తూ వెళ్లారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడుతున్నారు.

More Telugu News