Narendra Modi: జిన్ పింగ్ కు షడ్రుచుల విందు... వంటకాలను స్వయంగా ఎంపిక చేసిన మోదీ!

  • శుక్రవారం రాత్రి జిన్ పింగ్ కు ప్రత్యేక విందు
  • ఇడ్లీ, సాంబార్ కు మోదీ ప్రశంసలు
  • మెనూలో పలు చైనా వంటకాలు కూడా

నిన్న రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ, మహాబలిపురంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు అధ్యక్షుడితో పాటు చైనా నుంచి వచ్చిన అధికారులు, భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఈ విందులో వడ్డించాల్సిన వంటకాలను స్వయంగా మోదీ సెలక్ట్ చేశారట.

తమిళనాడు సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె, సాంబార్‌, చట్నీలను ప్రత్యేకంగా తయారు చేయాలని మోదీ ముందే ఆదేశించారట. వీటిని తిన్న తరువాత చాలా బాగా చేశారని మోదీ ప్రత్యేక కితాబు ఇవ్వడం గమనార్హం. వీటితో పాటు తమిళ వంటకాలను జిన్ పింగ్ కు రుచి చూపించాలని భావించిన మోదీ, పూరీ, శనగపప్పు కుర్మా, టమాట రసంతో పాటు కారైక్కుడి, బియ్యపు హల్వా, చెట్టినాడు రుచులతో కూడిన మెనూను తయారు చేయించారు.

వీటితో పాటు కొన్ని చైనా వంటకాలను సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా అక్కడి నుంచే వంటవారిని ముందే రప్పించారు. ఇక దాదాపు 75 మందికి పైగా వంటవారు విందుకు హాజరైన 300 మందికి వడ్డించాల్సిన 80 రకాల వంటకాలను రుచికరంగా సిద్ధం చేసి మెప్పు పొందారు.

More Telugu News