Narendra Modi: తమిళ సంప్రదాయ లుంగీకట్టులో వచ్చి జిన్ పింగ్ కు స్వాగతం పలికిన మోదీ

  • భారత్ వచ్చిన చైనా అధ్యక్షుడు
  • మహాబలిపురంలో మోదీతో చర్చలు
  • తమిళ ఆహార్యంతో సరికొత్తగా మోదీ

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురంలో చర్చలు జరుపున్నారు. జిన్ పింగ్ ఈ మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్లారు. ఈ సందర్భంగా మహాబలిపురంలో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.

తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ లుంగీకట్టుతో కనిపించడం విశేషం. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.

More Telugu News