Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను రాబట్టిన 'సైరా'

  • ఈ నెల 2న వచ్చిన 'సైరా నరసింహా రెడ్డి'
  • భారీతారాగణం - భారీ బడ్జెట్ 
  • మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం

భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో 'సైరా' ఈ నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన అన్ని భాషల్లోను విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోను ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను వసూలు చేయడం విశేషం.

'సైరా'కి  పోటీగా భావించదగిన సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులోనే కాకుండా విడుదలైన మిగతా భాషల్లోను ఈ సినిమా విజయకేతనాన్ని ఎగరేస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News