kannalakhminarayana: మహాత్ముని ఆశయ సాధనకు గాంధీ సంకల్ప యాత్ర: కన్నా లక్ష్మీనారాయణ

  • రేపు పోలవరం సందర్శన
  • పనుల తీరు, ప్రగతి పరిశీలన
  • 13న కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీ

గాంధీ 150 జయంత్యుత్సవాల్లో భాగంగా గాంధీ సంకల్ప యాత్ర చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరంలో ప్రస్తుత పరిస్థితి, ప్రగతిని ఈ సందర్భంగా తెలుసుకుంటామని చెప్పారు. అధికారులతో మాట్లాడుతామన్నారు. పోలవరం పూర్తి కావాలన్నది తమ సంకల్పమని, ఇందుకోసం అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 13న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కలిసి పోలవరం అంశంపై చర్చిస్తామని వెల్లడించారు.

More Telugu News