Road Accident: సత్తుపల్లి సమీపంలో బోల్తాకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. 40 మందికి తీవ్రగాయాలు

  • ఖమ్మం జిల్లా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో ఘటన
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
  • ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు

ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో బస్సులోని 40 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయి. హైదరాబాద్‌ నుంచి అమలాపురం వెళ్తున్న ఈ బస్సు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామ శివారు ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. స్పందించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులకు సేవలందించి బస్సునుంచి వారిని బయటకు తీశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News