kotamredyy: ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యత సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగింత!

  • నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డి, కాకాణి
  • ఈ ఇద్దరు నేతల మధ్య గ్రూపు తగాదాలు
  • జిల్లా నేతలతో సుబ్బారెడ్డి, సజ్జల సమావేశం

నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య గ్రూపు తగాదాలు, ఎంపీడీఓ సరళపై దౌర్యన్యం వ్యవహారంపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. నేతల మధ్య సయోధ్య బాధ్యతను వైసీపీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జలకు అప్పగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా నేతలతో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.

More Telugu News