Ranga Reddy District: అడవి పందిని తప్పించబోయి.. ప్రాణాలు కోల్పోయాడు!

  • కారులో పొలానికి బయల్దేరిన వినయ్ అనే వ్యక్తి
  • పందిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టిన వైనం
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వినయ్

తన వాహనానికి అడ్డుగా వచ్చిన అడవి పంది ప్రాణాలను కాపాడబోయిన ఓ వ్యక్తి... చివరకు తన ప్రాణాలనే కోల్పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, శంషాబాద్ మండలం పాలమాలకులకు చెందిన వినయ్ కిశోర్ యాదవ్ అనే వ్యక్తి తన కారులో పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఓ అడవి పంది కారుకు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయి పక్కన ఉన్న చెట్టుకు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో వినయ్ ఒక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు.

More Telugu News