Haryana: భారత్ మాతాకీ జై అనరా? అయితే మీరు పాకిస్థానీయులే!: బీజేపీ నేత సోనాలి ఫొగట్

  • హర్యానా ఎన్నికల్లో అదంపూర్ నుంచి బరిలోకి దిగిన సోనాలి ఫొగట్
  • భారత్ మాతా కీ జై అని నినదించని ప్రజలు
  • పాకిస్థాన్ నుంచి వచ్చారా? అని మండిపాటు

హర్యానా శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో అదంపూర్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సోనాలి ఫొగట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ మాతా కీ జై’ అనని వారి ఓట్లకు విలువలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలసమంద్ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనాలీ మాట్లాడుతూ.. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించాలని కోరారు. అయితే, కొందరు మాత్రమే నినదించగా, మరికొందరు సైలెంట్‌గా ఉండిపోయారు.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి మండిపడ్డారు. మీరంతా పాకిస్థాన్‌ నుంచి వచ్చారా? అని ప్రశ్నించారు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది. మీరు భారతీయులైతే భారత్ మాతా కీ జై అని నినదించండి’’ అని అన్నారు. దేశం కోసం జై అనలేని మీలాంటి భారతీయులు కూడా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారి ఓట్లకు విలువ లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, సోనాలి వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News