Pakistan: పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో విషాదం... గుండెపోటుతో అంపైర్ మృతి

  • కరాచీలో క్లబ్ మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తున్న నసీమ్
  • మ్యాచ్ మధ్యలో కుప్పకూలిన వైనం
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూత

పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది. నసీమ్ షేక్ అనే అంపైర్ మ్యాచ్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదిలాడు. కరాచీలో ఓ క్లబ్ స్థాయి మ్యాచ్ కు నసీమ్ అంపైరింగ్ చేస్తున్నాడు. స్థానిక టీఎంసీ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా నసీమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే ఆ అంపైర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ చిరువ్యాపారిగా ఉన్న నసీమ్ క్రికెట్ పై ఆపేక్షతో అంపైర్ గా ఎదిగాడు. కరాచీ క్రికెట్ వర్గాల్లో మంచి అంపైర్ గా గుర్తింపు తెచ్చుకున్నా, 56 ఏళ్ల వయసుకే తనువు చాలించాడు. నసీమ్ కు గతంలో ఏంజియోగ్రాఫీ నిర్వహించినట్టు తెలుస్తోంది.

More Telugu News